Verticillium dahliae
శీలీంధ్రం
ముందుగా కింది ఆకులు పసుపు రంగులోకి మారడం మొదలవుతుంది. ఈ లక్షణాలు తరచుగా మొక్కకు ఒక వైపున లేదా ఆకు సగం భాగంలో కనిపిస్తాయి. వ్యాధి సోకిన మొక్కలు, నీరు పెట్టినప్పటికీ పగటిపూట వాడిపోతాయి. మొక్క పెరిగేకొద్దీ, కాండం మీద మరియు లోపల చిన్న నల్లటి మచ్చలు కనిపించవచ్చు. తీవ్రంగా వ్యాధి సోకిన మొక్కలు ఆరోగ్యకరమైన వాటి కంటే ముందుగానే చనిపోతాయి, దీనివలన గింజ నాణ్యత మరియు దిగుబడి తగ్గుతుంది.
పూర్తిగా ప్రభావవంతమైన జీవ లేదా సేంద్రియ నియంత్రణ ఏదీ ప్రస్తుతం అందుబాటులో లేదు. కంపోస్టు వంటి సేంద్రియ పదార్థాన్ని నేలలో కలపడం వల్ల, వ్యాధికారకాన్ని అణచివేసే ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల కార్యకలాపాలకు మద్దతు లభించవచ్చు. సోలరైజేషన్: వేడి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో తేమగా ఉన్న నేలను ప్లాస్టిక్ షీట్ తో కప్పడం వల్ల నేల పైపొరలో శిలీంధ్రాల జనాభాను తగ్గించవచ్చు.
పొద్దుతిరుగుడు పంటలో వెర్టిసిలియం విల్ట్ నివారణకు చాలా పరిమితమైన రసాయన నియంత్రణ పద్ధతులు ఉన్నాయి, ఎందుకంటే మొక్కకు వ్యాధి సోకిన తర్వాత ప్రస్తుతం పూర్తిస్థాయిలో ప్రభావవంతంగా పని చేసే శిలీంధ్రనాశిని అందుబాటులో లేదు. విత్తే ముందు చేసే శిలీంధ్రనాశినితో విత్తన శుద్ధి ఈ వ్యాధి నియంత్రణలో సహాయపడవచ్చు. విత్తే సమయంలోనే విత్తన శుద్ధి చేయండి, ఎందుకంటే ఆకులపై పిచికారీ చేసే మందులు మట్టి ద్వారా వ్యాపించే వ్యాధికారకంపై ఎటువంటి ప్రభావం చూపవు. రసాయన నియంత్రణను ఎల్లప్పుడూ నివారణకు అనుబంధంగా మాత్రమే ఉపయోగించాలి, రసాయన నియంత్రణ ఒక్కటే పరిష్కారంగా ఎప్పుడూ వాడకూడదు.
వెర్టిసిలియం డాలియే అనే మట్టిలో ఉండే శిలీంధ్రం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ శిలీంధ్రం ఆతిథేయ మొక్క లేకుండా కూడా మట్టిలో జీవిస్తుంది. ఇది వేర్ల ద్వారా మొక్కలోకి ప్రవేశించి నీటి ప్రసరణను అడ్డుకుంటుంది. ఇది మట్టి, పరికరాలు, మొక్కల వ్యర్థాలు మరియు విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ క్రింది కారకాలు ఈ వ్యాధికి అనుకూలంగా ఉంటాయి: చల్లని నేల ఉష్ణోగ్రతలు (15°C మరియు 25°C మధ్య), సీజన్ ప్రారంభంలో నేలలో అధిక తేమ, ఆ తర్వాత పొడి పరిస్థితులు మరియు తక్కువ సేంద్రియ పదార్థం ఉన్న తేలికపాటి నేలలు.