Deudorix Isocrates
కీటకం
ముట్టడి యొక్క తరువాతి దశలలో లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రధానంగా పూమొగ్గలు మరియు పండ్లు ప్రభావితమవుతాయి. వి ప్రవేశించడానికి పండ్లకు చేసిన రంధ్రాలు పండ్ల రసం తో మూసివేయబడడం వలన మొదట్లో పండ్లు ఆరోగ్యంగా కనిపిస్తాయి. వ్యాధి పురోగమిస్తున్నప్పుడు, లార్వా దశల రంధ్రాలను లార్వా చివరి శరీర భాగం ద్వారా మూసినందువలన వాటిని గుర్తించవచ్చు. పూర్తిగా పెరిగిన లార్వా పండు గట్టి పైతొక్క కు రంధ్రం చెయ్యడం ద్వారా పండు నుండి బైటకి వచ్చి సాలెగూడును అల్లుతుంది. ఇది పండు లేదా కొమ్మను ప్రధాన శాఖకు కట్టి ఉంచుతుంది. దీని ప్రభావానికి గురైన పండ్లు ఫంగస్ మరియు బ్యాక్టీరియా దాడికి గురై కుళ్ళిపోయి చివరికి పడిపోతాయి. గొంగళి పురుగుల విసర్జన కారణంగా పండ్లు చెడు వాసనను ఉత్పత్తి చేస్తాయి. ప్రవేశ రంధ్రాల నుండి వీటి విసర్జన పదార్ధం బయటకు వచ్చి ఎండిపోతుంది. దీని వలన పండ్లు మానవ వినియోగానికి పనిచేయవు.
పరాన్నజీవి ట్రైకోగ్రామా జాతులు ఈ తెగులును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. 10 రోజుల విరామంలో వాటిని ఎకరానికి ఒక లక్ష చొప్పున నాలుగుసార్లు విడుదల చేయండి. వాటిని పొలం మధ్యలో మరియు పొలం అంచులలో ఉంచవచ్చు. డి. ఐసోక్రేట్స్ ను తినే కీటకాలైన లేస్వింగ్, లేడీబర్డ్ బీటిల్, సాలీడు, ఎర్ర చీమ, డ్రాగన్ ఈగ , రొబ్బర్ ఈగ, రెడ్యూవిడ్ పురుగు మరియు గొల్లభామ. ఇంకా, కందిరీగ జాతులు, పెద్ద కన్ను పురుగు (జియోకోరిస్ ఎస్పి), ఇయర్ విగ్, గ్రౌండ్ బీటిల్, పెంటాటోమిడ్ పురుగు (ఎయోకాంతెకోనా ఫర్సెల్లటా) పండు తొలుచు పురుగుకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉన్నట్లు నివేదించబడింది. పక్షులు కూడా గొంగళి పురుగును తింటాయి. గొంగళిపురుగులు పూరేకులను తింటాయి. అందువలన పరాగ సంపర్కం అయిన వెంటనే పువ్వుల క్రింది భాగంలో వుండే పూరేకులను తుంచేయాలి మరియు పుష్పించే దశలో వేప నూనెను (3%) వాడాలి. పురుగుల నుండి పండ్లను రక్షించడానికి పండు మొదలు చుట్టూ శుభ్రమైన మట్టిని (సూర్యరశ్మిచే వేడి చేయబడినది) అమర్చండి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పండు తొలుచు పురుగు పంటలో కనపడినట్లైతే, పుష్పించే దశలో, పుష్పించడం ప్రారంభమైనప్పటినుండి పంట కోత వరకు 15 రోజుల వ్యవధిలో లీటరు నీటికి 3.0 ఎంఎల్ ఆజాడిరక్తిన్ 1500 పిపిఎ ను కలిపి పిచికారీ చేయండి. పక్షం రోజుల వ్యవధిలో పుష్పించే నుండి పండ్లు వృద్ధిచెందేవరకూ కింది రసాయనాలలో ఒకదాన్ని పిచికారీ చేయండి: డైమెథోయేట్ (2 మి.లీ/లీ), ఇండోక్సాకార్బ్ (1 గ్రా/లి), సైపర్మెత్రిన్ (1.5 మి.లీ/లి) లేదా ప్రొఫెనోఫోస్ (2 మి.లీ/లి) . దానిమ్మ పండు తొలుచు పురుగు యొక్క సమర్థవంతమైన నియంత్రణ కోసం లాంబ్డా- సైహలోత్రిన్ వాడకం కూడా సిఫార్స్ చేయబడింది. ఒక లీటరు నీటికి 0.25 గ్రా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్ జి మరియు ఒక లీటరు నీటికి 0.20 మి.లీ స్పైనోసాడ్ 45 ఎస్ఎ పి చొప్పున వాడడం వలన పండ్ల నష్టంలో అత్యధిక తగ్గింపును నమోదు చేస్తుంది.
డ్యూడోరిక్స్ ఐసోక్రేట్స్ యొక్క లార్వా వల్ల దానిమ్మకు నష్టం సంభవిస్తుంది, దీనిని సాధారణంగా అనార్ బటర్ ఫ్లై లేదా దానిమ్మ పండు తొలుచు పురుగు అని పిలుస్తారు. ఇది దానిమ్మ పండు యొక్క అత్యంత వినాశకరమైన తెగులు. సీతాకోకచిలుకలు పగటిపూట చురుకుగా ఉంటాయి మరియు పండ్లు, లేత ఆకులు, పూల మొగ్గలు మరియు కాండాలపై ఒకొక్కటిగా గుడ్లు పెడతాయి. నియంత్రిత పరిస్థితులలో ఒక ఆడపురుగు సగటున 6.35 గుడ్ల చొప్పున 20.5 గుడ్లు పెడుతుంది. D. ఐసోక్రేట్స్ గుడ్లు పెట్టేసి స్థితి నుండి పెద్ద పురుగుగా ఎదగడానికి 33 నుండి 39 రోజులు పడుతుంది. పొదిగిన తరువాత, లార్వా పెరుగుతున్న పండ్లకు రంధ్రాలు చేసి లోపలకు ప్రవేశించి పండ్ల గుజ్జు మరియు ఎదుగుతున్న విత్తనాలను మరియు కణజాలాన్ని తింటుంది. 30 నుండి 50 రోజుల వయస్సులో ఇవి తినడం వలన కలిగే నష్టం అధికంగా ఉంటుంది. జులై నెలలో దానిమ్మ సీతాకోకచిలుక సంక్రమణ చాలా తీవ్రంగా ఉంటుంది మరియు సాపేక్ష ఆర్ద్రతతో గణనీయమైన సానుకూల సంబంధం చూపిస్తుంది. మార్చి నెలలో సంక్రమణ తక్కువగా ఉంటుంది మరియు సెప్టెంబరులో గరిష్ట స్థాయికి చేరుకునే వరకు క్రమంగా పెరుగుతాయి.

Put your product in front of farmers the moment they diagnose దానిమ్మలో పండు తొలుచు పురుగు — right when they need a solution.
Explore
Explore the live agronomic data that powers Plantix disease pages.
Discover