పనసలో కాయ తొలుచు పురుగు

Glyphodes caesalis

కీటకం

క్లుప్తంగా

  • చిగుర్లు మరియు కాయలను తింటూ పండులో రంధ్రాలు చేసి, గోధుమ రంగు మలాన్ని కుప్పలుగా విసర్జిస్తుంది.
  • పువ్వులు మరియు లేత కాయలు చెట్ల నుండి త్వరగా రాలిపోతాయి.
  • చిగుళ్ళు వాడిపోయి ఎండిపోతాయి.
  • కాయలు కుళ్ళిపోయి తినడానికి పనికిరాకుండా పోతాయి.
  • మొక్క మీద నల్లటి మచ్చలతో కూడిన ఎరుపు-గోధుమ రంగు గొంగళి పురుగులు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

0 పంటలు

లక్షణాలు

గొంగళి పురుగు ఎదిగిన చెట్ల లేత రెమ్మల చివరలపై దాడి చేసి, అవి వాడిపోయేలా చేస్తుంది. వీటి లార్వా ఎదుగుతున్న చిగుర్లు మరియు రెమ్మలలోకి రంధ్రాలు చేసి తొలుచుకుని వెళ్ళినప్పుడు అవి వాడిపోవడం, ఎండిపోవడం, ఎదుగుదల కుంటుపడటం, కాండాలు వంకరగా పెరగడం మరియు పక్క కొమ్మలు రావడం వంటి పరిణామాలకు దారితీస్తాయి. పూల గుత్తులను లోపలి నుండి తినడం వల్ల అవి పూయకుండా కుళ్లిపోతాయి. తొలిదశలో ఆశించినప్పుడు పండ్లు ఆకారం మారిపోవడం లేదా పచ్చి పండ్లు రాలిపోవడం జరుగుతుంది. తరువాతి దశలో, అవి పండిన పండ్లలోకి తొలుచుకుని, తినదగిన గుజ్జును దెబ్బతీస్తాయి. ఈ విధంగా తినడం వల్ల కలిగే నష్టమే ద్వితీయ దాడికి దారితీసి పండ్లు కుళ్లిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఎప్పుడు పిచికారీ చేయాలో నిర్ణయించడానికి ఏ స్థాయిలో తెగులు ఉందొ క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. జీవ సంబంధిత పిచికారీల వాడకంతో పాటూ పండ్లకు సంచులు కట్టండి. మంచి ఫలితాల కోసం గుడ్లు మరియు తొలి లార్వా దశలను లక్ష్యంగా చేసుకోండి. జీవ నియంత్రణ పద్ధతులు సరిపోనప్పుడు మాత్రమే రసాయన పురుగుమందులను ఉపయోగించండి.

రసాయన నియంత్రణ

చిగుర్లు లేదా పండ్లపై తెగులు దాడి యొక్క మొదటి సంకేతం కనిపించిన వెంటనే పురుగుమందులను పిచికారీ చేయండి. ఎదిగే దశలో ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీని పునరావృతం చేయండి. లేత చిగుర్లు, పూమొగ్గలు మరియు చిన్న పండ్లపై పిచికారీని కేంద్రీకరించండి. వేడి వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి ఉదయాన్నే లేదా సాయంత్రం పూట పిచికారీ చేయండి. పిచికారీని మరింత విస్తృతంగా చేయడానికి మంచి స్ప్రెడర్-స్టిక్కర్‌ను ఉపయోగించండి. పిచికారీ చేసేటప్పుడు ఎల్లప్పుడూ రక్షణ దుస్తులు ధరించండి.

దీనికి కారణమేమిటి?

పనస పంటలో పనస చిగుర్లు మరియు కాయ తొలుచు పురుగు (డయాఫానియా సీసాలిస్) ఒక ప్రధాన తెగులు, ముఖ్యంగా తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలలో. ఈ కాయ తొలుచు పురుగు పనస పంటకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది, ఇది మొగ్గ దశ నుండి కాయలు పక్వానికి వచ్చే వరకు పంటను ప్రభావితం చేస్తుంది. నల్లటి మచ్చలతో కూడిన ఎరుపు-గోధుమ రంగు గొంగళి పురుగు లేత చిగుర్లు, పూల గుత్తులు మరియు వృద్ధి చెందుతున్న కాయలలోకి తొలుచుకుపోయి, గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. పెద్ద చిమ్మట లేత గోధుమ రంగులో ఉండి, ముదురు గోధుమ రంగు మచ్చలు మరియు నారింజ రంగు చారలను కలిగి ఉంటుంది. ఆడ చిమ్మటలు లేత చిగుర్లు మరియు మొగ్గలపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పొదగబడిన తర్వాత లార్వాలు లోపలికి చొచ్చుకుపోతాయి. పూత మరియు కాయ దశలలో లార్వా కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పురుగు తినడం వల్ల కలిగే నష్టం, వర్షపు నీరు మరియు సూక్ష్మజీవుల కారణంగా ద్వితీయ వ్యాప్తికి మూలంగా ఉంటుంది. ఈ నష్టం పండ్లు మరియు మొక్కల మార్కెట్ విలువను తగ్గిస్తుంది.


నివారణా చర్యలు

  • రంధ్రాలు, వ్యర్థాల కుప్పలు, మరియు వాడిపోతున్న రెమ్మల కోసం ప్రతి వారం తోటను తనిఖీ చేయండి.
  • పురుగులు ఆశించిన ఒకదానితో మరొకటిగా కలిసిపోయివున్న రెమ్మలు, మొగ్గలు మరియు పండ్లను వెంటనే కత్తిరించండి.
  • తొలగించిన మొక్క భాగాలన్నింటినీ పూర్తిగా కాల్చివేయండి లేదా పాతిపెట్టండి.
  • గుడ్లు పెట్టకుండా నిరోధించడానికి లేత పండ్లను పాలిథీన్ సంచులతో కప్పండి.
  • పెద్ద చిమ్మటలను పట్టుకోవడానికి లైట్ ట్రాప్స్ ఉపయోగించండి.
  • పురుగులు చేసిన రంధ్రాలను శుభ్రం చేసి, వాటిని దూది మరియు మట్టి ముద్దతో నింపండి.
  • గాలి ప్రసరణను మెరుగుపరచడానికి మరియు తేమను తగ్గించడానికి చెట్ల కొమ్మలను కత్తిరించండి.
  • నేలపై రాలిన పండ్లు మరియు మొక్కల వ్యర్థాలన్నింటినీ తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి