Phakopsora euvitis
శీలీంధ్రం
ప్రారంభంలో ఆకు దిగువ భాగంలో నారింజ-గోధుమ రంగులో ఉండే పౌడర్ లాంటి పదార్ధం కనిపిస్తుంది. తరువాత, చిన్న పసుపు నుండి గోధుమ రంగు గాయాలు ఆకుల రెండువైపులా కనిపిస్తాయి. వ్యాధులు పెరిగేకొద్దీ నారింజ రంగు ద్రవ్యరాశి ముదురు-గోధుమ రంగు నుండి దాదాపు నలుపు రంగులోకి మారతాయి మరియు పొడుగుగా ఉండే గాయాలు ఏర్పడతాయి. భారీ ముట్టడి వలన చెట్టు మొత్తం పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది మరియు చివరికి ఆకులు అకాలంగా రాలిపోతాయి. తరువాతి సీజన్లో చిగుర్లలో పేలవమైన పెరుగుదల ఉంటుంది, దీనివల్ల తీగల ఎదుగుదల తగ్గుతుంది. ఈ వ్యాధి పేలవమైన చిగుర్ల ఎదుగుదల, పండ్ల నాణ్యత తగ్గడం మరియు దిగుబడిని కోల్పోయేలా చేస్తుంది.
శిలీంద్రనాశినులు కలిగిన సల్ఫర్ను ఆకులపై పిచికారీ చేయండి. వర్షపు వాతావరణంలో పిచికారీ చేయకండి.
అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. బోర్డియక్స్ మిశ్రమం, క్యాప్టాఫోల్, డిఫోలాటాన్, ప్రొపికోనజోల్, టెబుకోనజోల్ లేదా అజోక్సిస్ట్రోబిన్ కలిగిన శిలీంద్రనాశినులను వాడండి, ఇవి వ్యాధికారక జీవుల సంభావ్యతను గణనీయంగా తగ్గిస్తాయి. తరువాతి పెరుగుతున్న సీజన్లలో పక్షం రోజుల వ్యవధిలో 3 నుండి 4 సార్లు బేకర్ (0.1%) ను పిచికారీ చేయడం ద్వారా ద్రాక్షతోటలలో తుప్పు తెగులును నియంత్రించవచ్చు.
ఫకోస్పోరా వైటిస్ అనే ఫంగస్ వల్ల లక్షణాలు కలుగుతాయి. శిలీంధ్ర బీజాంశం మొక్కల శిధిలాలు మరియు ప్రత్యామ్నాయ అతిధేయలపై జీవిస్తుంది మరియు గాలి ద్వారా వెదజల్ల బడుతుంది. తుప్పు యొక్క వ్యాధికారకం అనేది ఆకుల దిగువ ఉపరితలంపై నారింజ రంగు కణికల రూపంలో ఉండే మచ్చలలో అభివృద్ధి చెందుతుంది. యురేడినోస్పోర్స్ యొక్క పసుపు నారింజ ద్రవ్యరాశి ఆకు దిగువ భాగంలో ఉత్పత్తి అవుతుంది. ఆకు ఎగువ ఉపరితలంపై ముదురు నెక్రోటిక్ మచ్చలు ఏర్పడతాయి. 20°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు మరియు తేమ వాతావరణ పరిస్థితులు వ్యాధి అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి. బీజాంశాలు గాలి మరియు గాలి ప్రవాహాల ద్వారా సులభంగా రవాణా అవుతాయి.

This page is powered by millions of live Plantix diagnoses. See where ద్రాక్షలో తుప్పు తెగులు is spreading — district by district — with Crop Insights, part of Plantix Intelligence.