పిస్తా

పిస్తాలో ఆకు మచ్చ తెగులు

Pseudocercospora pistacina

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులకు రెండు వైపులా ఎండిన గోధుమ రంగు మచ్చలు.
  • ఆకు ఈనెల మధ్య భాగం పాలిపోవడం లేదా గోధుమ రంగులోకి మారడం, క్రమంగా ప్రధాన ఈనె వైపు విస్తరించడం.
  • ఆకులు ఎండిపోవడం మరియు ముందుగానే రాలిపోవడం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పిస్తా

పిస్తా

లక్షణాలు

ఈ వ్యాధి కారణంగా ఆకులకు రెండు వైపులా, గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగులో గుండ్రని వృత్తాకారం నుండి సక్రమంగా లేని నిర్జీవ కణజాలం యొక్క మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు చాలా పెద్దవిగా మారవచ్చు మరియు 1 నుండి 2 మిమీ వ్యాసం వరకు పెరగవచ్చు. కాలక్రమేణా, ఆకు ఈనెల మధ్య ప్రాంతం ఆకు ఈనెల మధ్య భాగం పాలిపోయిన ఆకుపచ్చ రంగులోకి మారుతుంది తరువాత గోధుమ రంగులోకి మారతాయి. ఈ మచ్చలు క్రమంగా ప్రధాన ఈనె వైపు విస్తరిస్తాయి. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకులు ఎండిపోవడం మరియు ముందుగానే రాలిపోవడం జరుగుతుంది. ఆకులు వాడిపోయి ముందుగానే రాలిపోతాయి. పండ్లపై చాలా చిన్న మచ్చలు కూడా ఏర్పడవచ్చు. ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే ఆకులు రాలిపోతాయి మరియు చెట్టు యొక్క సత్తువను తగ్గిస్తాయి. సాధారణంగా ముందు సంవత్సరంలోని పంట ఆకుల చెత్తలో కనిపించే ఐనోక్యులమ్ నుండి ఈ వ్యాధి ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

మొదటి లక్షణాలు కనిపించిన వెంటనే, రాగి లేదా సల్ఫర్ ఆధారిత ఉత్పత్తులతో పిచికారీలు. అయితే పండ్లు బాగా చిన్నగా ఉన్నప్పుడు పండ్లకు ఫైటోటాక్సిక్ నష్టాన్ని నివారించడానికి పండు 1 సెంటీమీటర్ల పరిమాణానికి చేరుకున్న తర్వాత పిచికారీ చేయాలి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉన్నట్లయితే నివారణ చర్యలు మరియు జీవసంబంధమైన చికిత్సలతో కూడిన సమీకృత తెగులు నిర్వహణను ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. మచ్చలు కనిపించిన వెంటనే క్రియాశీల పదార్ధం థియోఫనేట్-మిథైల్ కలిగిన ఉత్పత్తులతో 2 లేదా 3 సార్లు పిచికారీ చేయండి. జినెబ్, మాంకోజెబ్, క్లోరోథలోనిల్ లేదా రాగి శిలీంద్ర నాశినుల ఆధారిత శిలీంద్ర నాశినులతో చికిత్సలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి, అయితే పండ్లు బాగా చిన్నగా ఉన్నప్పుడు పండ్లకు ఫైటోటాక్సిక్ నష్టాన్ని నివారించడానికి పండు 1 సెం.మీ పరిమాణానికి చేరుకున్న తర్వాత మాత్రమే వీటిని వాడాలి. ఈ మందులకు నిరోధకత వృద్ధి చెందకుండా నివారించడానికి వివిధ క్రియాశీల పదార్ధాలను ఒకదాని తర్వాత మరొక మందును వాడండి. మొగ్గలు రాలకుండా ఉండడానికి చేసే నివారణ చికిత్సలు కూడా వ్యాధి సంక్రమణను నివారించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి.

దీనికి కారణమేమిటి?

మైకోస్ఫేరెల్లా జాతికి చెందిన అనేక శిలీంధ్రాల వల్ల, ప్రధానంగా ఎం. పిస్టాసినా అనే శిలీంధ్రం వల్ల మధ్యధరా సముద్ర ప్రాంతంలో, లక్షణాలు సంభవిస్తాయి. ముందు సీజన్లలో చెట్టుకి సోకిన శిలీంధ్రం మట్టిలో రాలిపడిన ఆకులపై శీతాకాలం మనుగడ సాగిస్తుంది. ఈ ఆకుల నుండి వచ్చే ఫంగల్ ఐనోక్యులమ్ ద్వారా ప్రాథమికంగా సంక్రమిస్తుంది. వర్షపు తుంపర్లు సహాయపడతాయి. ఇతర రకాల బీజాంశాల వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి, ఇవి సీజన్ ముగిసే వరకు వర్షం లేదా స్ప్రింక్లర్ నీటి ద్వారా కూడా వ్యాపిస్తాయి. 20 మరియు 24 ° C మధ్య అధిక ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన వాతావరణం మరియు పొగమంచు వీటి వ్యాప్తికి మరియు వృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులు


నివారణా చర్యలు

  • మచ్చలు ఏర్పడిన వెంటనే గుర్తించడానికి క్రమం తప్పకుండా తోటను గమనిస్తూ ఉండండి.
  • రాలిన ఆకులను సేకరించి కాల్చివేయండి.
  • మొక్కల సహజ నిరోధకతను మెరుగుపరచడానికి చెట్లను సారవంతం చేయండి లేదా సేంద్రీయ పదార్థాలతో మీ మట్టిని సుసంపన్నం చేయండి.
  • మంచి వెంటిలేషన్ పందిరిని పొందడానికి మరియు సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి మొక్కలు నిద్రావస్థలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మొక్కల కత్తిరింపును ప్లాన్ చేయండి.
  • తోటలో మరియు చుట్టుప్రక్కల ప్రత్యామ్నాయ అతిధేయ మొక్కలు మరియు కలుపు మొక్కల ను తొలగించండి.
  • వ్యాధికారక సూక్ష్మ జీవుల వ్యాప్తిని నివారించడానికి తడి వాతావరణంలో వ్యాధి సోకిన మొక్కలను తాకకండి.
  • స్ప్రింక్లర్ నీటిపారుదల వ్యవస్థలను ఉపయోగించకండి.
  • శరదృతువు చివరిలో మరియు చలికాలం ప్రారంభంలో లోతుగా దున్నడం ద్వారా రాలిన ఆకులను పాతిపెట్టండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి