Ceratocystis paradoxa
శీలీంధ్రం
కత్తిరించబడిన చివర్ల ద్వారా లేదా కీటకాలు ఉత్పత్తి చేసే గాయాల ద్వారా ఫంగస్ లోనికి ప్రవేశిస్తుంది. ఇది అంతర్గత కణజాలాల ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఇవి మొదట ఎరుపుగా మారి తరువాత గోధుమ-నలుపు మరియు నలుపు రంగులోకి మారుతాయి. కుళ్ళిన ప్రక్రియ గుల్లలు ఏర్పడటానికి దారితీస్తుంది మరియు బాగా ముగ్గిన పైనాపిల్స్ యొక్క వాసన వంటి వాసనను విడుదల చేస్తుంది. ఈ వాసన చాలా వారాలు నిలిచి వుంటుంది. ఈ తెగులు సోకిన పంటల వేర్లు ఏర్పడటంలో విఫలమవుతాయి. తొలి మొగ్గలు పెరగడంలో విఫలమవుతాయి మరియు ఒకవేళ పెరిగినా చనిపోతాయి లేదా ఎదుగుదల తగ్గుతుంది.
సీజన్లో నాటడం ఆలస్యం అయినట్లయితే, నాటడానికి ముందు 30 నిమిషాలు వేడి నీటిలో (51 ° C వద్ద) సెట్లను చికిత్స చేయండి. పొలంలో మొలకెత్తని కాండాల కోసం చూడండి మరియు తెగులు సంకేతాలను (కుళ్ళిన మరియు దుర్వాసన) గుర్తించడానికి వాటిని చీల్చి చూడండి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శిలీంద్ర సంహారిణి వాడకం ఆర్థికంగా అనుకూలంగా ఉండదు.
నాటిన మొదటి వారాలలో తెగులు సంభవిస్తుంది. గాలి లేదా నీటిలో బీజాంశాల ద్వారా మరియు నీటిపారుదల నీటి వలన కూడా ఈ ఫంగస్ కూడా వ్యాపిస్తుంది. కీటకాలు, ముఖ్యంగా బీటిల్స్, సెట్లలోనికి రంధ్రాలు చేయడం ద్వారా బీజాంశాలను పంపిణీ చేస్తాయి. ఈ బీజాంశం కనీసం ఒక సంవత్సరం మట్టిలో జీవించగలదు. తెగులు సోకిన మొక్కలపై అవి చాలా నెలలు జీవించగలవు. వర్షం పడిన తర్వాత నీరు నిలువ వుండే ప్రాంతాలు ఈ తెగులుకు గురయ్యే అవకాశం ఉంది. 28°C ఉష్ణోగ్రతలు స్పోర్యులేషన్ మరియు ఫంగస్ పెరుగుదలకు చాలా అనుకూలంగా ఉంటాయి. సుదీర్ఘ కరువు వలన కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.

This page is powered by millions of live Plantix diagnoses. See where పైనాపిల్ లో నల్ల కుళ్ళు తెగులు is spreading — district by district — with Crop Insights, part of Plantix Intelligence.