Scarabaeidae sp.
కీటకం
తినడం ద్వారా పెద్ద పురుగులు మరియు లార్వాలు రెండూ మొక్కలకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ వేరు పురుగు పెద్ద ఎత్తున ఆకులను వేర్లను తినడం ఫలితంగా మొక్క వాడిపోయి మరియు పసుపు పచ్చగా మారుతుంది.వేరుశనగలో కాయల మీద కూడా దాడి చేయగలవు . వ్యాధి తీవ్రమైనప్పుడు మొక్కలు తుదకు చనిపోతాయి మరియు లాగితే సులభంగా ఊడి వస్తాయి. దాడి జరిగినప్పుడు పంట మీద లక్షణాలు వెంటనే కనబడవు. దీర్ఘకాలంలో మొక్క జీవితకాలం తగ్గిపోయి నెమ్మదిగా దిగుబడి తగ్గిపోతుంది. సంవత్సర పంటల్లో తొలి లక్షణంగా ఉన్నట్టుండి అకురాలడం జరుగి తరవాత ఆకు ఎదగక ముందే రాలిపోతుంది. వ్యాధి భారినపడిన మొక్కలు అతుకులు అతుకులుగా అక్కడ పసుపుపచ్చగా మారి చనిపోతాయి.
ఉపయోగంగా వుండే నెమటోడ్స్ ద్రావణాన్ని (హెటేరోహడ్బిటిస్ sp మౌంటేన్ టై 1)హెక్టారుకు 150 కోట్ల నెమటోడ్స్ నేలపై వున్న గ్రబ్ లార్వా పైన పిచికారీ చేయండి. సోలానం సురత్తేన్స్ సారాన్నిన్ని విత్తన శుద్ధికి వాడవచ్చు. అంతే కాక విత్తనాలని విత్తే ముందు కెర్నల్ కిరోసిన్ ( 75 కేజీ విత్తనాలకు ఒక లీటర్) లో ముంచి విత్తాలి. బ్రేకొనిడ్స్, తుమ్మెదలు, ట్రైకొగ్రామాడిస్ లను సంరక్షించండి. NPV మరియు పచ్చ మస్కార్డీన్ ఫంగస్ లాంటి జీవనియంత్రణలను కూడా వాడవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. భూమిలో నుండి పైకి రాగానే ఇవి దగ్గర్లో ఉన్న మొక్కల పై దాడి చేస్తాయి. కార్బరిల్ లేదా ఎండోసల్ఫాన్ వంటి కీటకనాశినులను రాత్రి వేళల్లో చల్లటం మంచిది. క్లోరోఫైరిపాస్ 20% EC @ 1125 ml / ha ఈ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. 6.5ml / Kg చొప్పున క్లోరోఫైరిపాస్ తో విత్తన చికిత్స కూడా ఈ కీటకాలు అభివృద్ధిని నిరోధించుటకు మంచి మార్గం.
హోలోట్చియా ప్రజాతి యొక్క వైట్ గ్రబ్స్ సమూహాల వలన ఈ లక్షణాలు సంభవిస్తాయి. ఎదిగిన వేరు పురుగు కాఫీ వర్ణంలో ఉండి 20 ఎం ఎం పొడవు కలిగి ఉండి, 80 ఎం ఎం వెడల్పు కలిగి ఉంటాయి. వర్షం పడిన మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత, అవి మట్టి నుండి పైకి వచ్చి కొద్ది దూరం ఎగిరిపోయి చుట్టుపక్కల మొక్కల మీద దాడి చేసి తింటాయి. ఈ పురుగులు తిన్న తరువాత దాక్కొని గుడ్లు పెట్టుటకు మట్టిలోనికి తిరగి వెళ్లి పోతాయి. ఆడ వేరు పురుగులు మట్టిలో 5 నుండి 8 సెంటీమీటర్స్ లోతులో 20-80 వరకు తెల్లని మరియు గోళాకారంగా వున్న గుడ్లను పెడతాయి. వీటి లార్వాలు తెలుపు పసుపు రంగులో ఉండి 5 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. వీటి తల పసుపు వర్ణంలో, శరీరం తెల్లని వర్ణంలో ఉండి C ఆకారంలో ఉంటుంది. మొదట కొన్ని వారాలవరకు ఇవి సేంద్రియ పదార్ధాలను తిని ఆ తరువాత వేర్లను, కాయలను తింటాయి. వేరుశనగ కాకుండా ఇవి చెరుకు, మిరప, జొన్న, మొక్కజొన్న, మరియు కందుల వేర్లను కూడా తింటాయి.