ఫోమోప్సిస్ ఆకు మచ్చ తెగులు

Phomopsis durionis

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులపై చిన్న, గుండ్రని, ఎరుపు-గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • ఈ మచ్చలు పెద్దవిగా పెరిగి, తరచుగా వాటి అంచు చుట్టూ పసుపు రంగు వలయం ఏర్పడుతుంది.
  • ముందు వచ్చిన మచ్చల మధ్యభాగం బూడిద-తెలుపు రంగులోకి మారుతుంది.
  • నిర్జీవమైన మచ్చల మధ్యలో చిన్న నల్లటి చుక్కలు కనిపిస్తాయి.
  • వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే ఆకులు పసుపు రంగులోకి మారి, త్వరగా రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

0 పంటలు

లక్షణాలు

ఈ వ్యాధి ఆకులపై చిన్న చిన్న, గుండ్రని, ఎరుపు-గోధుమ రంగు మచ్చలుగా మొదలవుతుంది. ఈ మచ్చలు పెరిగేకొద్దీ, వాటి వెలుపలి అంచు చుట్టూ తరచుగా ఒక పల్చటి పసుపు వలయం ఏర్పడుతుంది. పాత మచ్చలలో, మధ్యభాగం లేత బూడిద లేదా తెలుపు రంగులోకి మారి, కాగితంలా పల్చబడుతుంది. మీరు ఈ బూడిద రంగు ప్రాంతాలను చాలా దగ్గరగా చూసినట్లయితే చిన్న చిన్న నల్లటి చుక్కలు కనిపిస్తాయి. ఇవే శిలీంధ్రంలో కొత్త బీజాంశాలు తయారయ్యే భాగాలు. ఒకే ఆకుపై అనేక మచ్చలు ఏర్పడినప్పుడు అవి ఒకదానితో మరొకటి కలిసిపోయి పెద్ద ప్రాంతాలను కప్పివేయగలవు. దీనివల్ల ఆకు పసుపు రంగులోకి మారి, ఎండిపోయి, ముందుగానే చెట్టు నుండి రాలిపోతుంది. ఈవిధంగా ఆకులకు నష్టం వాటిల్లడంవలన చెట్టు బలహీనపడి అది ఉత్పత్తి చేసే పండ్ల పండ్ల సంఖ్య తగ్గుతుంది..

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పర్యావరణ అనుకూలమైన పద్ధతులలో, ఆకు మచ్చ తెగులుతో పోటీపడే ప్రయోజనకరమైన శిలీంధ్రాలు లేదా బ్యాక్టీరియా వంటి సహాయక సూక్ష్మజీవులను ఉపయోగించడం కూడా ఒకటి. ఒక జీవసంబంధమైన అవరోధాన్ని సృష్టించడానికి వీటిని ఆకులపై పిచికారీ చేయవచ్చు. వేప నుండి తయారు చేసిన నేచురల్ ఎక్సట్రాక్ట్స్ కూడా శిలీంధ్రం పెరుగుదలను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయి. ఈ జీవసంబంధమైన చికిత్సలను సీజన్ ప్రారంభంలో లేదా వ్యాధికి వాతావరణ పరిస్థితులు మొదట అనుకూలంగా మారినప్పుడు ప్రారంభిస్తే ఉత్తమంగా పనిచేస్తాయి

రసాయన నియంత్రణ

వ్యాధి చెట్టు అంతటా విస్తృతంగా వ్యాపించే అవకాశం రాకముందే, ఒక రక్షణ కవచంలా స్ప్రేలను పిచికారీ చేయాలి. ఈ శిలీంధ్రం అనేక బీజాలను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి, మొక్క యొక్క అత్యంత సున్నితమైన పెరుగుదల దశలను కవర్ చేసేలా సరైన సమయంలో మందులను పిచికారీ చేయడం ముఖ్యం. వివిధ రకాల నివారణ పద్ధతులను ఉపయోగించడం వల్ల, కాలక్రమేణా శిలీంధ్రం ఈ మందులకు నిరోధకతను పెంచుకోకుండా నివారించవచ్చు.

దీనికి కారణమేమిటి?

వ్యాధి సోకిన ఆకులు మరియు పాత మొక్కల అవశేషాలపై జీవించే ఒక శిలీంధ్రం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ బీజాంశాలను, నేల పైనుండి లేదా పాత ఆకుల నుండి ఆరోగ్యంగావున్న కొత్తఆకులపై వర్షపు చినుకులు చిమ్మినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ శిలీంధ్రం వెచ్చని వాతావరణంలో మరియు అధిక తేమలో, ముఖ్యంగా వర్షాకాలంలో వృద్ధి చెందుతుంది. ఇది ఆకులోని చిన్న సహజ రంధ్రాలు లేదా చిన్న గాయాల ద్వారా ప్రవేశిస్తుంది. అధిక నత్రజని స్తాయిలు మొక్కల పెరుగుదలను మృదువుగా మరియు లేతగా మార్చి, చెట్టుపై శిలీంధ్రం దాడి చేసే అవకాశాన్ని పెంచుతుంది. ఒకసారి ఇది ప్రారంభమైతే, ఈ శిలీంధ్రం ఆకులపై ఉన్న నల్లటి మచ్చలలో కొత్త బీజాలను ఉత్పత్తి చేస్తుంది, వాటిని గాలి మరియు వర్షం తోటలోని ఇతర చెట్లకు వ్యాపింపజేస్తాయి.


నివారణా చర్యలు

  • ఆకు మచ్చ తెగులు సోకే అవకాశం తక్కువగా ఉండే డురియన్ రకాలను ఎంచుకుని నాటండి.
  • కొమ్మల మధ్య గాలి బాగా ప్రసరించేందుకు చెట్ల మధ్య సరైన దూరం ఉండేలా నాటండి.
  • గాలి ప్రసరణ కోసం చెట్టు పైభాగాన్ని కత్తిరించండి, వర్షం పడిన తర్వాత ఆకులు త్వరగా ఆరడంలో ఇది సహాయపడుతుంది.
  • శిలీంధ్రాన్ని నిర్మూలించడానికి రాలిన ఆకులన్నింటినీ మరియు తెగులు సోకిన కొమ్మలను తొలగించి కాల్చివేయండి.
  • పైనుంచి నీరు పెట్టడం మానుకోండి, ఎందుకంటే తడి ఆకులు బీజాంశాలు వ్యాప్తి చెంది పెరగడానికి సహాయపడతాయి.
  • మొక్కలు బాగా మృదువుగా, బలహీనంగా పెరిగే భాగాలను నివారించడానికి ఎరువుల వాడకాన్ని జాగ్రత్తగా మేనెజ్ చేయండి.
  • ఒక చెట్టు నుండి మరొక చెట్టుని కత్తిరించే ముందు, కత్తిరించే పనిముట్లను క్రిమిసంహారక మందుతో శుభ్రం చేయండి.
  • ముఖ్యంగా వర్షాకాలంలో.
  • గోధుమ రంగు మచ్చల మొదటి సంకేతాల కోసం పండ్ల తోటను క్రమం తప్పకుండా గమనిస్తూఉండండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి