Pythium aphanidermatum
శీలీంధ్రం
నేలతో ప్రత్యక్ష సంబంధంలో కలిగిన పండ్లపై మృదువైన, కుళ్ళిన ప్రాంతాలుగా అభివృద్ధి చెందే గోధుమ రంగు ప్రాంతాలుగా లక్షణాలు ప్రారంభమవుతాయి. తేమతో కూడిన పరిస్థితులలో, తెల్లటి, పత్తి లాంటి పెరుగుదల కనిపిస్తుంది మరియు పండు యొక్క ఈ కుళ్ళిన ప్రాంతాన్ని కప్పివేస్తుంది. నర్సరీలో, అదే వ్యాధికారకం చిన్న మరియు పెద్ద మొలకలకు నష్టం కలిగించి వాటి మరణానికి కారణమవుతుంది. ఇది వేర్లకు కూడా నష్టం కలిగించి అవి కుళ్లిపోయేటట్టు చేస్తుంది: మొక్క పోషకాలను తీసుకోలేనందున ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. పైథియం వల్ల కలిగే పండ్ల తెగులు ఫైటోఫ్థోరా మరియు స్క్లెరోటినియా వల్ల కలిగే పండ్ల తెగులు లాగా కనిపిస్తుంది. వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి, గుర్తుంచుకోండి: పైథియం ప్రత్తి లేదా షేవింగ్ క్రీమ్ లాగ కనిపిస్తుంది. ఫైటోఫ్తోరా పిండి లేదా పొడి లాగా కనిపిస్తుంది. స్క్లెరోటినియా, కాండం మీద కూడా కనిపించే నల్లటి గట్టి మచ్చలతో మందపాటి తెల్లటి దూదిలాగ ఉంటుంది.
ఈ తెగులుకి ధ్రువీకరించబడిన మరియు వర్తించగలిగే జీవ నియంత్రణ లేదు.
లక్షణాలు కనిపించిన తర్వాత, ప్రభావితమైన మొలకలు లేదా పండ్లను రక్షించలేము. సంక్రమణను నివారించడానికి, విత్తనాలు మరియు మొలకలకి రసాయన చికిత్సలను వర్తించండి. నాటడానికి ముందు విత్తనాలను శుద్ధి చేయండి మరియు సిఫార్సు చేసిన సాంద్రతలో మొలకలని ముంచండి. అదనంగా, ఉపరితల మట్టి చికిత్సలను కూడా ఉపయోగించండి. ఈ చికిత్సల ప్రభావం నీటిపారుదల లేదా వర్షపాతం ద్వారా మట్టి యొక్కపైన అంగుళం ప్రాంతానికి శిలీంద్ర నాశిని చేరుకోవడంపై ఆధారపడి ఉంటుంది.
కాటనీ లీక్కు కారణమయ్యే వ్యాధికారక సూక్ష్మజీవి మట్టిలో నివసిస్తుంది! వేడి, తేమతో కూడిన వాతావరణం మరియు నీరు నిలిచే ప్రాంతాలు దీనికి అనుకూలంగా ఉంటుంది . ఇది సాగునీటి ద్వారా వ్యాపిస్తుంది. ఇది చాల సులభంగా మొక్క యొక్క కణాలలోకి ప్రవేశించి మొక్క పోషకాలను సంగ్రహించకుండా అడ్డుకుంటుంది మరియు ప్రభావితమైన భాగాలు కుళ్లిపోయేటట్టుచేస్తుంది. కత్తిరింపు లేదా ఆకులను తొలగించడం వల్ల కలిగే గాయాలు మొక్కలు దీనికి ఎక్కువగా ప్రభావితమవుతాయి, తద్వారా వ్యాధికారక సూక్ష్మజీవి సులభంగా వ్యాప్తి చెందుతుంది.