Colletotrichum capsici
శీలీంధ్రం
ప్రారంభ లక్షణాలుగా ఆకులపై బూడిద రంగు మధ్యభాగంతో పొడవుగా వుండే నిడుపువాటుగా ఉండే పాలిపోయిన మచ్చలు కనిపిస్తాయి. మచ్చలు చిన్నగా, 1-2 మిమీ వ్యాసం కలిగి ఉంటాయి. ఈ మచ్చలు ఒకదానితో మరొకటి కలిసిపోయి, సాధారణంగా 4-5 సెం.మీ పొడవు మరియు 2-3 సెం.మీ. వెడల్పు గల మచ్చలుగా మారిపోతాయి. వ్యాధి తరువాతి దశల్లో, నల్లని చుక్కలు కేంద్రీకృత వలయాలుగా మారుతాయి. బూడిదరంగు కేంద్రాలు సన్నగా మారి చివరికి చిరిగిపోతాయి. దాడి తీవ్రత అధికంగా ఉన్న సందర్భంలో, ఆకుల రెండు వైపులా వందలాది మచ్చలు కనిపిస్తాయి. తీవ్రంగా ప్రభావితమైన ఆకులు వాడిపోయి, ఎండిపోతాయి.
వ్యాధి సంభవాన్ని తగ్గిస్తాయని నిరూపించబడిన టి. హర్జియానమ్, టి. విరిడే వంటి బయో ఏజెంట్లను ఉపయోగించండి. అలాగే, పి. లాంగిఫోలియా యొక్క మొక్కల సారం వ్యాధి నియంత్రణకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణించండి. విత్తన పదార్థాన్ని మాంకోజెబ్ @3గ్రా/లీటరు నీటితో లేదా కార్బెండజిమ్ @1గ్రా/ లీటరు నీటితో 30 నిమిషాల పాటు చికిత్స చేయండి మరియు ప్లేనింగ్ ముందు నీడలో ఆరబెట్టండి. మాంకోజెబ్ @2.5 గ్రా/ లీటరు నీటితో లేదా కార్బెండజిమ్ @1గ్రా/లీటరు నీటితో 15 రోజులకొకసారి 2-3 మార్లు పిచికారీ చేయండి.
విత్తనాలు నాటే సమయంలో సంక్రమణకు ప్రాధమిక వనరు అయిన రైజోమ్ల పైన ఉండే ఫంగస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ద్వితీయ వ్యాప్తి గాలి, నీరు, ఇతర మరియు భౌతిక, జీవసంబంధ ఏజెంట్ల వల్ల సంభవిస్తుంది. వ్యాధికారక సూక్ష్మ జీవి వ్యాధి సోకిన మొక్క అవశేషాలపై ఒక సంవత్సరం పాటు జీవించి ఉండగలదు.

This page is powered by millions of live Plantix diagnoses. Reach farmers at the exact moment they diagnose పసుపు పంటలో ఆకుమచ్చ తెగులు with Demand Creation, part of Plantix Intelligence.