Monilinia laxa
శీలీంధ్రం
పంటను బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి మరియు ప్రధానంగా బ్లాసమ్ ఎండు తెగులు మరియు పండ్ల కుళ్ళు తెగులు దశ కలిగి ఉంటాయి. బ్లాసమ్ ఎండు తెగులు యొక్క మొదటి లక్షణం పువ్వులు ఎండిపోవడం, ఇవి గోధుమ రంగులోకి మారుతాయి మరియు తరచుగా జిగురు వంటి పదార్థంలో కొమ్మకు అంటుకుని ఉంటాయి. అంటువ్యాధులు కొమ్మలోకి విస్తరించవచ్చు మరియు చుట్టూ నడికట్టు గా మారవచ్చు. రెమ్మలు పూర్తిగా చనిపోకపోతే, ఇన్ఫెక్షన్ పుష్పాల నుండి వృద్ధి చెందుతున్న ఆకులు మరియు పండ్లకు పాకుతుంది. ఆకులు ఎండిపోతాయి కాని ఏడాది పొడవునా చెట్టుకే అంటిపెట్టుకుని ఉంటాయి. చెట్లకు వున్న పండ్లతో పాటు నిల్వ చేసిన వాటిపై కూడా పండ్ల తెగులు ప్రభావం చూపిస్తుంది. పండ్లపై మృదువైన, గోధుమరంగు ప్యాచీలు కనిపిస్తాయి. ఈ ప్యాచీలు పెరిగేకొద్దీ, తెలుపు లేదా పసుపు స్ఫోటములు టాన్ ప్రాంతాలలో, కొన్నిసార్లు కేంద్రీకృత వృత్తాలుగా వృద్ధి చెందుతాయి. క్రమంగా పండ్లు చెట్టు మీద నిర్జలీకరణ చెంది, కుళ్ళి, మమ్మీ వలే అవుతాయి. నిల్వ చేసిన పండ్లు స్ఫోటములను వృద్ధి చేయకపోవచ్చు మరియు పూర్తిగా నల్లగా మారవచ్చు.
గాయం చేసే ఏజెంట్ యొక్క నిర్మూలన పండ్ల తెగులు దశను నియంత్రించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. వాహకాలుగా పనిచేసే లేదా పండ్లపై గాయాలు కలిగించే కీటకాలు మరియు పక్షుల నియంత్రణ వ్యాధి సంభవం తగ్గించడానికి ఒక మార్గం. పక్షులను దిష్టిబొమ్మలతో నియంత్రించవచ్చు. కందిరీగ గూళ్ళను వెతికి నాశనం చేయాలి. పండ్ల ప్యాకింగ్ మరియు నిల్వలో ప్రత్యేక శ్రద్ధ అవసరం ఎందుకంటే ఫంగస్ పండ్ల మధ్య వ్యాపిస్తుంది.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. చెర్రీస్ ఈ వ్యాధికి తక్కువ అవకాశం ఉన్న రాతి పండు మరియు వాతావరణం సంక్రమణకు అనుకూలంగా ఉంటే లేదా పండ్ల తోటకు ఈ వ్యాధి చరిత్ర ఉంటే తప్ప నివారణా పిచికారీ అవసరం ఉండదు. డైఫెనోకోనజోల్ మరియు ఫెన్హెక్సామిడ్ ఆధారిత శిలీంద్ర నాశినులను ఒకటి లేదా రెండు సార్లు వాడడం ప్రభావవంతంగా ఉంటుంది. సంక్రమణ యొక్క తరువాతి దశల్లో ఫంగస్ ను తొలగించడం సాధ్యం కాదు. వడగళ్ళు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల తర్వాత రక్షక శిలీంద్ర నాశినిని వాడండి. కీటకాల నియంత్రణ ఒక ముఖ్యమైన విషయం కావచ్చు ఎందుకంటే మోనిలియా లక్సా గాయాల ద్వారా సంక్రమిస్తుంది.
మోనిలియా లక్సా చాలా అతిధీ మొక్కలకు, ముఖ్యంగా బాదం, ఆపిల్, అప్రికోట్, చెర్రీ, పీచ్, పియర్, ప్లమ్ లేదా క్విన్సు వంటి రాతి పండ్లకు సంక్రమిస్తుంది. ఈ ఫంగస్ ఎండిన ఆకులు లేదా చెట్ల నుండి వేలాడుతున్న మమ్మీఫైడ్ పండ్లలో శీతాకాలం మనుగడ సాగిస్తుంది మరియు దీని బీజాంశం గాలి, నీరు లేదా కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. పండ్లపై (పక్షులు, కీటకాలు) గాయాల ద్వారా, ఆరోగ్యకరమైన మరియు తెగులు సోకిన భాగాలు ఒకదానితో మరొకటి తాకడం సంక్రమణకు అనుకూలంగా ఉంటుంది. వికసించే సమయంలో అధిక తేమ, వర్షం లేదా మంచు మరియు ఒక మోస్తరు ఉష్ణోగ్రతలు (15°C నుండి 25°C) సంక్రమణ ప్రక్రియకు అనుకూలంగా ఉంటాయి. ఈ పరిస్థితులలో పండ్లపై స్ఫోటముల వృద్ధి ముఖ్యంగా కనిపిస్తుంది. వేసవి మధ్యనుండి పండ్లు చెట్ల మీద లేదా నిల్వలో ఉన్నప్పుడు పండ్లపై లక్షణాలు కనిపిస్తాయి. నిల్వ చేసిన పండ్లు పూర్తిగా నల్లగా మారవచ్చు మరియు స్ఫోటములను అభివృద్ధి చేయవు. ఈ తెగులు విస్తరించే అవకాశం అధికంగా ఉండడం వలన తోటలలో లేదా నిల్వ చేసినప్పుడు గణనీయమైన నష్టాలను కలిగించవచ్చు.

This page is powered by millions of live Plantix diagnoses. Reach farmers at the exact moment they diagnose గోధుమరంగు కుళ్ళు తెగులు with Demand Creation, part of Plantix Intelligence.