వరి

మాని పండు తెగులు/కాటుక తెగులు

Villosiclava virens

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • చిన్న నారింజ రంగు, నున్నని 'బాల్స్' కొన్ని ధాన్యం గింజలపై కనిపిస్తాయి.
  • ఈ బాల్స్ ఎండిపోయి పచ్చని-నల్ల రంగులోకి మారతాయి.
  • ధాన్యం రంగు పోయి బరువు తగ్గిపోతుంది.
  • అంకురోత్పత్తి తగ్గుతుంది.

లో కూడా చూడవచ్చు


వరి

లక్షణాలు

కంకులు ఏర్పడేటప్పుడు లక్షణాలు కనిపిస్తాయి, ముఖ్యంగా స్పైక్లెట్ దాదాపుగా పరిపక్వతకు చేరుకున్నప్పుడు. 1 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఆరెంజ్, వెల్వెట్ గ్రుడ్డు ఆకారపు ద్రవ్యరాశి కంకుల్లో ధాన్యాలపై కనిపిస్తుంది. తరువాత ధాన్యాలు పసుపు-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ-నలుపు రంగులోకి మారుతాయి. కొన్ని ధాన్యాలు మాత్రమే కంకుల్లో బీజాంశ బాల్స్ గా మారతాయి. మొక్క యొక్క ఇతర భాగాలు ప్రభావితం కావు. ధాన్యం బరువు మరియు విత్తనాల అంకురోత్పత్తి తగ్గుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

52°C డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద విత్తనాలను 10 నిమిషాల పాటు శుభ్రం చేయడం వలన ఈ తెగులు సోకకుండా ఆపటానికి ఉపయోగపడుతుంది. ఈ తెగులు నివారణ చర్యలలో భాగంగా వరి కంకులు వచ్చే సమయంలో కాపర్ ఆధారిత శీలింద్ర నాశినులను (లీటర్ నీటికి 2.5 గ్రా) పిచికారీ చేయండి. తెగులును గుర్తించిన వెంటనే, దీన్ని నియంత్రించడానికి మరియు కొద్దిగా దిగుబడిని పెంచడానికి కాపర్ ఆధారిత శీలింద్ర నాశినులను పిచికారీ చేయండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విత్తనాల్ని శుద్ధిచేయడంవలన కూడా తెగులు అరికట్టబడదు. వరి కంకులు వేసే సమయంలో (50 నుండి 100%) , ఒక నివారణ చర్యగా ఈ క్రింది ఉత్పత్తులు పిచికారి చేస్తే ప్రభావవంతంగా ఉంటాయి: అజోక్సిస్ట్రోబిన్, ప్రొపికోనజోల్, క్లోరోతరానిల్, అజోక్సిస్ట్రోబిన్ + ప్రొపికోనజోల్, ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ + ప్రొపికోనజోల్, ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ + టేబుకానజోల్. అరియోఫంగిన్, కప్తాన్ మరియు మాంకోజెబ్ పిచికారీ చేయడం వలన తెగులు మరింత పురోగతి చెందకుండా ఆపుతుంది. వ్యాధి లక్షణాలు గుర్తించిన తర్వాత వ్యాధి యొక్క పురోగతిని సమర్థవంతంగా నిరోధించడానికి ఇతర ఉత్పత్తులు సహాయపడతాయి: ఆరియోఫంగిన్, కప్తాన్ లేదా మాంకోజెబ్.

దీనికి కారణమేమిటి?

విల్లోసిక్లవ వైరెన్స్ అనే ఫంగస్ వలన ఈ తెగులు లక్షణాలు ఏర్పడతాయి. ఈ వ్యాధికారక ఫంగస్ మొక్క అన్ని దశలలోను సంక్రమించవచ్చు కానీ పుష్పించేదశలో కానీ గింజ పాలుపోసుకునే సమయంలో కానీ ఈ తెగులు లక్షణాలు బయటపడతాయి. ఎక్కువ తేమ (>90%) వున్న వాతావరణ పరిస్థితులు తరుచుగా వర్షం పడడం మరియు 25−35º C ఉష్ణోగ్రత ఈ తెగులును అనుకూలంగా ఉంటాయి. మట్టిలో ఎక్కువ నత్రజని శాతం వున్నా ఈ తెగులు త్వరగా సోకుతుంది. ముందుగా నాట్లు నాటడం వలన ఈ తెగులు వలన తక్కువ నష్టం కలుగుతుంది. ఈ తెగులు వలన పంటకు 25 శాతం వరకు నష్టం కలుగుతుంది. భారత దేశంలో ఈ నష్టం శాతం 75 శాతం వరకు వుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన వరి వంగడాలను ద్రువీకరించించబడిన డీలర్స్ నుండి మాత్రమే కొనండి.
  • తెగులు నిరోధక వరి వంగడాలను వాడండి.
  • వీలైతే ముందుగానే విత్తనాలను నాటండి.
  • దానివలన తెగులు తీవ్రత పెరగకముందే పంట కోతకు వస్తుంది.
  • శాశ్వతంగా నీటిని వుంచేకన్నా(తేమను తగ్గించడం) ఒకసారి తడిగా ఇంకొకసారి పొడిగా పొలాన్ని ఉంచండి.
  • నత్రజని ఎరువులను ఒక మోస్తరు మోతాదులో వాడండి.
  • మొత్తం నత్రజని ఎరువును విభజించి కొద్దికొద్దిగా పొలంలో వేయండి.
  • తెగులు సోకిందేమో తెలుసుకోవడానికి పొలాన్ని తరచుగా గమనిస్తూ వుండండి.
  • పొలం గట్లుసాగు నీటి కాల్వలు శుభ్రంగా ఉంచండి.
  • పంట కోతలు పూర్తయిన తర్వాత పొలంలో కలుపుమొక్కలు, తెగులు సోకిన మొక్కలు, మరియు వరి కంకులను, విత్తనాలను తొలగించండి.
  • పొలాన్ని లోతుగా దున్నడంవలన ఎండా బాగా తగిలేట్టు చేయడం వలన ఈ తెగులు తరువాత పంటలకు సోకకుండా చేయవచ్చు.
  • వీలున్నంతవరకు సంప్రదాయపద్ధతిలో పొలాన్ని దున్ని వరిపంటను కొనసాగించండి.
  • 2 లేదా 3 సంవత్సరాలకు ఒక సారి పంటమార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి