ఇతరములు

రైంకోస్పోరియం

Rhynchosporium secalis

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ముదురు ఆకులపై పాలిపోయిన, సక్రమంగా లేని లేదా వజ్రం ఆకారం లాంటి గాయాలు వ్యాపిస్తాయి.
  • అంచులు గోధుమ రంగులోకి మారినప్పుడు గాయాల మధ్యభాగం ఎండిపోయి బ్లీచ్ అవుతాయి.
  • ఈ మచ్చలు పెరిగి ఒకదానితో మరొకటి కలిసిపోయి ఆకు మొత్తం కవర్ చేస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
బార్లీ

ఇతరములు

లక్షణాలు

మొలకల తొడుగులు, ఆకులు, ఆకు తొడుగులు, కాయ తొడుగులు, పూల తొడుగులు మరియు శూకాల (పువ్వుల నుండి బయటకు వచ్చే జుట్టు లాంటి ఉపాంగాలు) మీద ఏర్పడే విలక్షణమైన గాయాల ద్వారా రింకోస్పోరియం వర్గీకరించబడుతుంది. దీని లక్షణాలు మొదటగా ముదురు ఆకు ఈనెల మధ్య భాగం లేదా ఆకు కాడ మొదలుపై సక్రమంగా లేని పాలిపోయిన డైమండ్ ఆకారపు గాయాలు (1-2 సెం.మీ.) కనిపిస్తాయి. తరువాత ఈ గాయాలు సాధారణంగా బూడిద రంగులోకి మారి నీరు లాంటి రూపాన్ని సంతరించుకుంటాయి. తరువాత, లేత బూడిద, లేత గోధుమరంగు లేదా తెలుపు రంగులోకి మారి గాయాల మధ్యభాగం ఎండిపోయి బ్లీచ్ అవుతుంది. వాటి అంచులు ముదురు గోధుమ రంగులోకి మారుతాయి. ఈ మచ్చల చుట్టూ పసుపు రంగు పాలిపోయిన వలయం ఏర్పడవచ్చు. ఈ మచ్చలు పెరిగి ఒకదానితో మరొకటి కలిసిపోయి ఆకు ఈనెల వరకు పరిమితం కాకుండా దీర్ఘచతురస్రాకారంగా అండాకారంగా మారుతాయి. తరువాతి దశల్లో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే లేత ఆకులు మరియు పుష్పగుచ్ఛాలకు కూడా సోకవచ్చు. పూలకి ఈ తెగులు సోకితే తేలికపాటి లేత గోధుమరంగు కేంద్రాలు మరియు శూకాల మొదళ్ళ దగ్గర ముదురు గోధుమ రంగు అంచులతో గాయాలు ఏర్పడతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, రైన్‌కోస్పోరియం సెకాలిస్‌కి వ్యతిరేకంగా ఎటువంటి ప్రత్యామ్నాయ చికిత్స గురించి మాకు తెలియదు. ఈ వ్యాధితో పోరాడటానికి సహాయపడే ఏదైనా సమాచారం మీకు తెలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీ నుండి వినడానికి మేము ఎదురుచూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో సహా సమీకృత తెగులు నిర్వహణను ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. విత్తనాలను శిలీంద్ర నాశినులతో చికిత్స చేయడం ద్వారా సీజన్ ప్రారంభంలో అంటువ్యాధి సంభావ్యతను తగ్గించవచ్చు. వివిధ రకాల చర్యతో పనిచేసే స్ట్రోబిలురిన్ మరియు అనిలినోపైరిమిడిన్ గ్రూపు యొక్క శిలీంద్ర నాశినుల మిశ్రమాలను ఉపయోగించండి.

దీనికి కారణమేమిటి?

రైంకోస్పోరియం అనేది విత్తనం ద్వారా సంక్రమించే శిలీంధ్రం, ఇది మొక్కల అవశేషాలు లేదా స్వచ్చందంగా మొలిచే మొక్కలపై కూడా ఒక సంవత్సరం వరకు జీవించగలదు. బీజాంశాలు వర్షపు తుంపర్ల ద్వారా మరియు కొంత మేరకు గాలి ద్వారా కొంత దూరం వరకు వ్యాపిస్తాయి. 5°C మరియు 30°C మధ్య ఉష్ణోగ్రతల వద్ద బీజాంశం ఏర్పడటం మరియు సంక్రమణం సంభవించవచ్చు. 15°C మరియు 20°C మధ్య ఉష్ణోగ్రతలు మరియు 7 నుండి 10 గంటల పాటు ఆకు తడి ఈ వ్యాధి సంక్రమణకు అనుకూలమైన పర్యావరణ పరిస్థితులు మొదట లక్షణాలు కనిపిస్తాయి మరియు అధిక ఉష్ణోగ్రతల వద్ద మరింత తీవ్రంగా ఉంటాయి. పై ఆకు మరియు నేరుగా కింద ఉన్న రెండు ఆకులు ప్రభావితమైతే, దిగుబడి తగ్గుతుంది. గుప్త సంక్రమణం (లక్షణాలు బైటకి కనిపించకపోవడం) ఉన్నట్లయితే, వ్యాధికారకం ఒక సీజన్ నుండి మరొక సీజన్ వరకు మొక్కల అవశేషాలలో జీవించగలదు.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఈ వ్యాధిని తట్టుకోగల విత్తన రకాలను ఉపయోగించండి.
  • శీతాకాలపు బార్లీ మరియు శీతాకాలపు ఆవాల పంటను ఆలస్యంగా సాగు చేయండి.
  • పొలంలో మరియు చుట్టుపక్కల కలుపు మొక్కలను నియంత్రించండి.
  • ఫంగస్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు వ్యాధి సంకేతాల కోసం మొక్కలు లేదా పొలాలను తనిఖీ చేయండి.
  • ఈ తెగులు సోకని మొక్కలతో పంట భ్రమణం చేయండి.
  • పొలాన్ని లోతుగా దున్ని మొక్కల అవశేషాలను పాతిపెట్టండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి