Puccinia graminis
శీలీంధ్రం
5 mins to read
సంక్రమణము జరిగిన తరువాత 7 నుండి 15 రోజుల తర్వాత మొదటి లక్షణాలు చూడవచ్చు. కాండము, ఆకుల తొడుగులు, ఆకులు మరియు అప్పుడప్పుడు పుష్ఫీకరణం నుండి ఎర్ర-గోధుమ రంగు, గుడ్డు ఆకారములో వుండే పొడవైన బుడిపెలు కనపడవచ్చు. కాండము మరియు ఆకు తొడుగులు ముఖ్యంగా ప్రభావితం అయ్యే కణజాలములు. ఈ బూజు స్ఫోటములు పెరుగుతాయి మరియు తరచుగా అని మచ్చలు కలిసి పెద్ద ప్రాంతాలను కవర్ చేస్తాయి. ఫలితంగా మొక్క యొక్క బాహ్యచర్మం నష్టం ప్రభావిత ప్రాంతాలలో ఒక కఠినమైన తీరులో కనిపిస్తుంది. ఈ తెగులు బాగా అధికంగా సోకితే కాండం బలహీనపడి మొక్కలు భారీ గాలులు మరియు వర్షం వచ్చినప్పుడు పడిపోతాయి. బూజు తెగులు నీరు మరియు పోషక రవాణాను అడ్డుకొని నీటి నష్టం చేస్తుంది, మొక్క యొక్క ఓజస్సు తగ్గుతుంది మరియు ధాన్యమునకు పోషకాలు తక్కువగా సరఫరా అవుతాయి. ధాన్యం ముడతలు పడి ఉంటుంది. దీని ఫలితం తగ్గిన దిగుబడి. మొత్తం మొక్క బలహీనపడుతుంది, ఇతర రోగకారక క్రిముల సంక్రమణకు అధిక అవకాశం కలిగిస్తుంది. ధాన్యం పూర్తిగా నిండక ముందే ఈ తెగులు బాగా అభివృద్ధి అయితే చాలా అధిక మొత్తంలో దిగుబడి నష్టం కలుగుతుంది.
క్షమించండి, మాకు పుక్కినియా ట్రిటిసిన కు వ్యతిరేకంగా పనిచేసే జీవ నియంత్రణ చికిత్స గురించి తెలియదు. మీకు ఏమైనా సమాచారం తెలిస్తే దయచేసి మీరుమాకు తెలపండి. మీ నుండి సమాచారం కొరకు ఎదురు చూస్తున్నాము.
వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ శిలీంధ్రాలను నియంత్రించడానికి టేబుకోనజోల్ లేదా ప్రొతియోకోనజోల్ తో కూడిన శిలీoద్ర నాశినులను ఉపయోగించవచ్చు. ట్రియాజోల్ మరియు స్ట్రోబిలురిన్స్ కల శిలీంద్ర నాశకాలను కూడా వాడొచ్చు. ఈ ఫంగస్ స్ట్రోబిలురిన్స్ కు కొంతవరకు నిరోధకత కలిగినట్టు గమనించబడింది.
ఈ లక్షణాలు జీవించి వున్న మొక్క కణజాలం అవసరం వున్న పుక్కినియా గ్రామినిస్ అనే ఫంగస్ ద్వారా కలుగుతాయి. బీజాంశాలు గాలి ద్వారా చాల దూరం వ్యాప్తి చెంది మరియు నీటి సంబంధం కలిగినప్పుడు మొలకెత్తుతాయి. ఈ తెగులు ఇతర మార్గాలలో యంత్రాలు మరియు వాహనాలు, టూల్స్, దుస్తులు మరియు పాదరక్షలు ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ సంక్రమణ ఆకు ఉపరితల సహజ రంధ్రాల ద్వారా బూజు తెగులు చొచ్చుకొనిపోవడము వలన జరుగుతుంది. మరియు ఈ ప్రక్రియ తక్కువ కాంతి తీవ్రతల సమయములో (ఉదయం లేదా సాయంత్రం సమయాలలో), తరచుగా మంచు బిందువు లేదా అధికంగా వర్షపాతం వుండి దీర్ఘకాలం ఆకు తడసినపుడు జరుగుతుంది. కాండం తుప్పు తెగులు (25-30°C) పగలు మరియు తక్కువ ఉష్ణోగ్రత రాత్రులు(15-20°C) మంచు బిందువులు పడే సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రక్రియ కేవలం గోధుమ పంటకు మాత్రమే పరిమితమై ఉంది, కానీ ఇతర ఆతిధులు (ఇతర తృణధాన్యాలు, గడ్డి మరియు బెర్బెరీస్ పొదల జాతులు) కూడా వాహకాలుగా పనిచేయగలవు లేదా ప్రభావితమవగలవు.